కూటమి ప్రభుత్వ అరాచకాలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించామని ఆ పార్టీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా లేవనెత్తుతామని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పార్టీ బలంగా ఉందన్నారు. ఇలాంటి ఘటనలతో ప్రజల్లో భయం పట్టుకుందని, ఏపీలో లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టాలన్నారు.