వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రహదారిలో గల ఆంజనేయస్వామి దేవాలయంలో, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పూజా కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. గడిచిన ఎన్నికలలో స్వామివారి ఆశీస్సులతో వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించినందుకు స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. వినుకొండ నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి నమ్మకాన్ని నిలుపుకుంటానన్నారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.