కొమరాడ మండలం గంగరేగులవలస గ్రామానికి చెందిన గడాల వెంకటరాయుడు అనే రైతు పండించిన కూరగాయలను అమ్మడం కోసం సోమవారం తన గ్రామం నుంచి సైకిల్ పై కల్లికోట వెళ్తుండగా మార్గమధ్యంలో ఏనుగులు గుంపు ఎదురు పడింది. దీంతో రైతు బయపడి అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లగా ఏనుగుల గుంపు సైకిల్ను ధ్వంసం చేసి, అమ్మకానికి తెచ్చిన కూరగాయలను తిని వెళ్ళిపోయాయి. దాంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.