పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 24నుంచి జూన్ మూడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిఆర్ఒ జి. కేశవ నాయుడు తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మన్యం జిల్లా స్థాయికమిటీ సమావేశం కలెక్టరేట్లో శనివారం జరిగింది. ఈ సమావేశంలో డిఆర్ఒ మాట్లాడుతూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పార్వతీపురం డివిఎంఎం, సాలూరు, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు.