దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

75చూసినవారు
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో బలిజిపేట మండలం నారాయణపురం , గళావిల్లి, తోటపల్లి దేవాలయాల పరిస్థితిని మంత్రికి వివరించారు. ఆలయాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని అలాగే గిరిజన గ్రామంలో టీటీడీ దేవాలయం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే తెలియజేసిన అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించరన్నారు.

సంబంధిత పోస్ట్