‘పల్లె పండుగ’తో గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి: పవన్

80చూసినవారు
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్‌శాఖ పనిచేస్తోంది. అవినీతికి ఆస్కారంలేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూపాయి లంచం లేకుండా, ఎవరి సిఫారసులు లేకుండా బదిలీలు జరిగాయి. కూటమి ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా క్షుణ్ణంగా పరిశీలించి బదిలీలు చేశాం. లంచం అనే పదం వినిపిస్తే కార్యాలయం నుంచి వెళ్లిపోవాల్సిందే’ అని పవన్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్