ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన నేతలతో సమావేశమయ్యారు. డొక్కా సీతమ్మ సేవలను మనమంతా నిత్యం స్మరించుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణ త్యాగం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు.