ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సోమవారం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. 3 రోజుల పాటు పిఠాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు