ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు పింఛన్లు ఇవ్వలేదు: చంద్రబాబు

1078చూసినవారు
ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు పింఛన్లు ఇవ్వలేదు: చంద్రబాబు
ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు పింఛన్లు ఇవ్వకుండా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కొత్తపేటలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని ప్రసంగించారు. ’’అధికారులు ఒక్క నెల కూడా ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వలేరా?, వృద్ధులు, దివ్యాంగులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలి. అధికారంలోకి వచ్చాక ఎస్సీల కోసం సబ్‌ప్లాన్‌ అమలు చేసి వృద్ధిలోకి తీసుకొస్తాం. మాదిగలకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తాం’’అని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్