తీహార్ జైలు నుంచి విడుదలైన ఎంపీ సంజయ్ సింగ్

75చూసినవారు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 6 నెలలు జైలు జీవితం గడిపిన ఆప్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసింది. ఆయనను బెయిల్‌పై విడుదల చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకుఈడీ తెలిపింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన విషయ తెలిసిందే.

సంబంధిత పోస్ట్