ప్రజలు భారీగా తరలివచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మే 13న పోలింగ్ను తక్కువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. 85 శాతానికి పైగా పోలింగ్ నమోదవ్వడంపై వైసీపీ తట్టుకోలేకపోయిందన్నారు. వైసీపీ దాడుల్లో గాయపడిన వారికి చరిత్ర లేదన్నారు. టీడీపీ తరఫున ఏజెంట్లుగా కూర్చోవడమే వారు చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు.