తిరుపతిలో పోలింగ్ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. యదేచ్చగా సెల్ ఫోన్ను పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లి తాను వైసీపీకి ఓటు వేసినట్లు ఓ ఓటర్ వీడియో తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ వీడియోని ఏకంగా సోషల్ మీడియాలో పెట్టడంతో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అంబేద్కర్ స్కూల్ ఎస్టీవీ నగర్ లోని 14వ వార్డులో బూత్ నెంబర్ 146లో ఈ ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఆ ఓటర్ మీడియా ప్రతినిధి అని సమాచారం.