హర్యానాలోని కర్నల్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని గూడ్స్ డబ్బాలు రైల్వే లైన్లపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ-అంబాలా రూట్లో అనేక రైళ్లకు అంతరాయం ఏర్పడింది. కర్నల్ సమీపంలోని తారారోయిలో ఈ ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 నిమిషాల మధ్య రైలు పట్టాలు తప్పింది. ట్రాక్లను క్లియర్ చేసి, సర్వీసులను ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీనియర్ రైల్వే అధికారి తెలిపారు.