పిన్నెల్లి అమాయకుడు: జగన్

66చూసినవారు
పిన్నెల్లి అమాయకుడు: జగన్
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణుడు అమాయడని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. అతడిపై అక్రమంగా కేసు బనాయించి జైలులో పెట్టారని ఆరోపించారు. వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను దారుణంగా చంపివేశారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. నారా లోకేష్‌ ఏకంగా రెడ్‌బుక్‌ ప్రదర్శిస్తూ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. రాష్ట్రమంతా హోర్డింగులు పెట్టి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారో చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్