వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్

64చూసినవారు
వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్
ప్రొద్దుటూరులో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డిపై వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి అభ్యంతరం తెలిపారు. కాసేపటికి ఎమ్మెల్యే రాచమల్లును పోలీసులు బయటకు పంపించారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యే బయటకు వెళ్లేటప్పుడు వైసీపీ నేతలు అడ్డుకొని ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్