పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ల మండలం నార్నెపాడులో పోలింగ్ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడి ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. టీడీపీ కార్యకర్తల దౌర్జన్యానికి దిగారంటూ మండిపడ్డారు.