దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఇద్దరు యువకుల్ని సీఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లా దొడ్డపురంలో జరిగింది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను సీఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకుని మోకాళ్లపై కూర్చొబెట్టారు. లాఠీతో కొట్టడంతో యువకులు సొమ్మసిల్లారు. వారికి సీఆర్పీఎఫ్ సిబ్బంది నీళ్లు తాగించారు.