మోదీ సారధ్యంలోని కాషాయ కూటమిని మట్టికరిపించి విపక్ష ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి బీజేపీని నిలువరించేలా తాము బెంగాల్ నుంచే కూటమికి సాయం చేస్తామని చెప్పారు. తనకు అందిన సమాచారం ప్రకారం ఎన్డీయే కేవలం 190 నుంచి 195 స్ధానాలకే పరిమితమవుతుందని, విపక్ష ఇండియా కూటమి 315 స్ధానాల్లో గెలుపొందుతుందన్నారు.