వైసీపీ హ‌యాంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు: అనిత

83చూసినవారు
వైసీపీ హ‌యాంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు: అనిత
AP: వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశార‌ని రాష్ట్ర హోంమంత్రి వంగ‌లపూడి అనిత విమ‌ర్శించారు. "కేంద్ర నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదు. నేటికీ విశాఖ జిల్లాలో ఒక పీఎస్‌ రేకుల షెడ్డులోనే నడుస్తోంది. ఎస్కార్ట్‌ వాహనాలు కూడా పనిచేయట్లేదని ఫిర్యాదులొస్తున్నాయి." అని ఆమె పేర్కొన్నారు. డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారుల స‌మావేశంలో హోమంత్రి ఈ మేర‌కు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్