దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. శనివారం కృష్ణంరాజు జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాట్లను శ్యామలాదేవి చూసుకుంటున్నారు. జయంతి వేడుకలు,హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందిస్తానని తెలిపారు.
వైసీపీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శ్యామలాదేవి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.