ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా పడింది. కొద్దిసేపటి క్రితం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వాయిదా వేయాలని నిర్ణయించారు. తిరిగి మహానాడు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మరోసారి సమీక్ష జరిపి ప్రకటన చేద్దామని చంద్రబాబు పేర్కొన్నారు.