దర్శి : పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్

68చూసినవారు
దర్శి : పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్
జిల్లాలో వర్షాలకు 3750 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని 3200 మంది రైతులు పంటలు నష్ట పోయారని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు. తాళ్లూరు మండలంలోని రామభద్రాపురంలో మొక్క జొన్న, మాధవరం, శివరాంపురంలలో గుమ్మడి తోటలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. కలెక్టర్ రూ. 300 - రూ. 400 కోట్ల వరకు పంట నష్టం జరిగిందన్నారు.