కొమరోలు: మరో మారు చోరీకి యత్నం

76చూసినవారు
కొమరోలు నల్లగుంట షిరిడి సాయిబాబా ఆలయంలో దొంగలు మరోమారు చోరీకి యత్నించారు. గురువారం దొంగలు ఆలయంలోకి ప్రవేశించి చోరీ చేస్తుండగా స్థానికులు అక్కడికి చేరుకున్న విషయాన్ని గుర్తించిన దొంగలు ద్విచక్ర వాహనంపై పారారయ్యేందుకు ప్రయత్నించారు. కొద్ది దూరం వెళ్ళాక ద్విచక్ర వాహనాన్ని వదిలి దొంగలు పరారయ్యారు. కొద్దిరోజుల క్రితం ఇదే ఆలయంలో దొంగలు చోరీకి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్