జీతాలు చెల్లించాలంటూ నిరసనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు

64చూసినవారు
కొమరోలులోని అమరావతి కడప రాష్ట్రీయ రహదారిపై శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులు తమ జీతాలు చెల్లించాలంటూ నిరసనకు దిగారు. 30 నెలలకు పైగా జీతాలు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పట్టణంలో స్వల్పంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్నా ఎస్సై మధుసూదన్ రావు సంబంధిత అధికారులతో మాట్లాడి జీతాలు ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో పారిశుద్ధ్య కార్మికులు నిరసన విరమించారు.

సంబంధిత పోస్ట్