ఉపాధి పని దినాలను 200 రోజులకు పెంచాలి

57చూసినవారు
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పని దినాలను 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు సోమవారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. కేరళ ప్రభుత్వం తరహాలో రోజుకు సరాసరి కూలీ 600 రూపాయలు వరకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ధరలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్