కొమరోలు: అల్లినగరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

65చూసినవారు
కొమరోలు: అల్లినగరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం, పామూరు పల్లి గ్రామాలలో గురువారం స్థానిక వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ రైతులకు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. తుఫాను కారణంగా రైతులు పంటలు నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి చెప్పారు. అలానే ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో అందించే శనగ విత్తనాల కొరకు మీ స్థానిక రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలని రైతులకు రాజశ్రీ సూచించారు.

సంబంధిత పోస్ట్