కంభం పట్టణంలో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన పార్టీ గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తర్వాత ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న నవరత్నాల పథకాలు మళ్లీ అందాలంటే వైసిపికే ఓటు వేయాలని నాగార్జున రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.