సింగరాయకొండ మండలంలో ఈనెల 3వ తేదీ నుంచి గ్రామ సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ నగేష్ కుమారి మంగళవారం తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వలంటీర్ల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను మంగళవారం మధ్యాహ్నానికి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పింఛన్ల పంపిణీ ఎక్కడనేది తెలియజేస్తామని ఆమె చెప్పారు.