
పొన్నలూరు: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
హనుమాన్ జయంతి పురస్కరించుకొని తోరణాలు కడుతూ విద్యుత్ షాక్ తో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన పొన్నలూరులో గురువారం జరిగింది. మృతుడు పొన్నలూరు కు చెందిన వెలగపూడి వెంకట సాయి మహేంద్ర కుమార్ గా స్థానికులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద విలపించిన తీరు కంటతడి పెట్టించింది. పండగ రోజు గ్రామంలో యువకుడు మృతి చెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.