ఒంగోలు లోక్సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళ, బుధవారాల్లో నగరంలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర పరిధిలోని రామ్ నగర్ లో మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. అనంతరం నగరంలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. బుధవారం ఉదయం 9 గంటల వరకు మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.