సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిల నియామకం

82చూసినవారు
సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిల నియామకం
సుప్రీం కోర్టుకు కొత్త జడ్జిలుగా జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్.మహదేవన్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. కాగా వీరిద్దరికీ పదోన్నత కల్పిస్తూ ఇది వరకే సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా చేరిన ఇద్దరు జడ్జిలతో కలుపుకొని సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సహా మొత్తం జడ్జిల సంఖ్య 34కు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్