వరప్రసాద్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే ఏలూరి

64చూసినవారు
వరప్రసాద్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే ఏలూరి
అనారోగ్యంతో మృతి చెందిన చినగంజాం మండలాభివృద్ధి అధికారి యు. బి. వరప్రసాద్ సంతాప సభ బుధవారం ఎండిఓ కార్యాలయంలో జరిగింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరై వరప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పనిచేసింది కొద్దికాలమే అయినా వరప్రసాద్ ప్రజలకు విశేష సేవలు అందించారని ఆయన కొనియాడారు. వరప్రసాద్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావలసినవన్నీ త్వరగా వచ్చేటట్లు చూస్తానని ఏలూరి హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్