Apr 17, 2024, 14:04 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం
Apr 17, 2024, 14:04 IST
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మైదం యశోద, మొండయ్య దంపతుల స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో జనహితసేవా సమితి సభ్యులు, దాతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.