విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చిక్కుకుపోయిన భారతీయులు

72చూసినవారు
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చిక్కుకుపోయిన భారతీయులు
లండన్‌ నుంచి ముంబయికి బయలుదేరిన అట్లాంటిక్ విమానాన్ని అధికారులు టర్కీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురి కావడంతో విమానాన్ని టర్కీలో ల్యాండింగ్ చేశారు. తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 16 గంటల నుంచి టేకాఫ్ చేయలేదు. అయితే ఈ విమానంలో సుమారు 200 మంది భారతీయులు ఉండడంతో వారంతా అవస్థలు పడుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్