కర్ణాటకలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-మైసూర్ ఎక్స్ప్రెస్వేలో మండ్య జిల్లా ప్రాంతానికి సమీపంలో కారును KSRTC బస్సు ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలిలోనే ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృతి చెందారని మండ్య జిల్లా SP మల్లికార్జున్ బల్దండి తెలిపారు.