అమీన్‌పూర్ పిల్లల హత్య కేసు.. తల్లి అరెస్ట్

65చూసినవారు
అమీన్‌పూర్ పిల్లల హత్య కేసు.. తల్లి అరెస్ట్
TG: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఇటీవల రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో తల్లి రజిత తన ప్రియుడి శివతో కలిసి జీవించడానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని.. అన్నంలో విషం పెట్టి చంపినట్లు తెలిసింది. దీంతో వారు రజిత, ఆమె ప్రియుడు శివను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్