కుక్కల దాడికి భయపడి నీటి కుంటలో పడిపోయిన జింక

4436చూసినవారు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని అంబేద్కర్ కాలనీలో అడవి నుండి జింక పిల్ల దారి తప్పి ఆదివారం జనసంచారంలోకి వచ్చింది. కుక్కలు వెంట పడటంతో డేవిడ్ అనే వ్యక్తి నివాసంలోని నీటి తొట్టిలో జింక పడింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ స్నేక్ రీస్క్యూవర్ మల్లికార్జునకు సమాచారంతో నీటి తొట్టి నుండి జింకను సురక్షితంగా బయటకు తీసి నల్లమల అడవిలోకి వదిలేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్