త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలోని జాతీయ రహదారిపై గురువారం కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు గొల్లపల్లికి చెందిన హరిబాబుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల త్రిపురాంతకంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరగడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.