అద్వానీకి భారతరత్న ప్రదానం (వీడియో)

66చూసినవారు
మాజీ ఉపప్రధాని, బీజేపీ ప్రముఖ నేత ఎల్‌కే అద్వానీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం భారతరత్నను ప్రదానం చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి భారత అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. అనారోగ్యం రీత్యా అద్వానీ బయటకు రాలేని పరిస్థితి ఉండడంతో ఆయన ఇంటికే వెళ్లి పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్