రాజమండ్రిలో దొంగలు చెలరేగిపోతున్నారు. పట్టణంలో ఉన్న ఒక ఫైనాన్స్ కార్యాలయంలో ఇద్దరు దొంగలు చొరబడి నగదు కాజేశారు. లాకర్లు పగులగొట్టి డబ్బులను బ్యాగులో సర్దేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. శుక్రవారం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.