లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఇటీవల 195 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్టులో ఒకే ఒక పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆయనే డాక్టర్ అబ్దుల్ సలామ్. ఈ జాబితాలో ఏకైక ముస్లిం అభ్యర్థి ఈయనే. కేరళలోని మలప్పురం నియోజకవర్గం నుంచి సలామ్ పోటీ చేయనున్నారు. విద్యావేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సలామ్ 2019లో బీజేపీలో చేరారు.