లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని షురూ చేసింది. 'సంసద్ మే బీ కేజ్రీవాల్, తో ఢిల్లీ హోగీ ఔర్ ఖుష్ హాల్' నినాదంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ప్రచారాన్ని ప్రారంభించారు. కాగా 4:3 ఫార్ములా సీట్ల షేరింగ్తో కాంగ్రెస్తో ఆప్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.