అత్యాచార నిందితులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి అనిత

62చూసినవారు
అత్యాచార నిందితులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి అనిత
AP: నంద్యాల, విజయనగరం జిల్లాల్లో జరిగిన అత్యాచార ఘటనలపై సచివాలయం వద్ద హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. తప్పు చేసింది ఎవ‌రైనా వదిలిపెట్టబోమని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ముచ్చుమర్రి కేసులో బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్ర‌క‌టించారు. విజయనగరం జిల్లాలో బాధిత చిన్నారి పేరుపై రూ.5 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్