రైతు భరోసా నిధులు విడుదల

458309చూసినవారు
రైతు భరోసా నిధులు విడుదల
ఐదో విడత రైతు భరోసా నిధులను సీఎం జగన్ బుధవారం విడుదల చేశారు. రైతు భరోసా కింద 53.58 లక్షల మంది ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,078 కోట్లు జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.34,288 కోట్లు చెల్లించామన్నారు.

సంబంధిత పోస్ట్