హిమాచల్ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. రాష్ట్రంలో ఏకైక రాజ్యసభ సీటును గెలుచుకున్న తర్వాత బీజేపీ నేతలు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, అందుకే గవర్నర్ను కలిసి బలపరీక్ష పెట్టాల్సిందిగా కోరామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.