మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52 మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14 మంది, మాచర్ల టౌన్కు చెందిన 10 మంది, మాచర్ల రూరల్కు చెందిన 22 మంది, కారంపూడి మండలానికి చెందిన ఆరుగురిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు.