టీడీపీ నేతల దరఖాస్తును తిరస్కరించిన ఆర్టీసీ అధికారులు

578చూసినవారు
టీడీపీ నేతల దరఖాస్తును తిరస్కరించిన ఆర్టీసీ అధికారులు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీని టీడీపీ నాయకులు కోరారు. 100 బస్సులు కావాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, 50 బస్సుల కోసం ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు దరఖాస్తు చేశారు. వారి అభ్యర్థనను అధికారులు నిరాకరించారు. చేసేదిలేక ఇరుపార్టీల శ్రేణులు సొంత వాహనాల్లోనే సభకు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్