ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు.