నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతిచెందగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను స్థానికులు కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.