తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 10 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 75,449 మంది భక్తులు దర్శించుకోగా, 27,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది.